కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. మూడ్రోజులపాటు

Woman Filed Molestation Case In Suryapet District - Sakshi

యువతిపై ఇద్దరు యువకుల లైంగికదాడి 

పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం

కోదాడ రూరల్‌: ఓ యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు లైంగికదాడి చేశారు. ఇంట్లో బంధించి మూడ్రోజులు చిత్రహింసలు పెట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణంలోని మాతానగర్‌కు చెందిన బాధితురాలు ఈ నెల 15న రాత్రి 9.30 గంటల సమయంలో బయటకు వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన గౌస్, సాయిరాంరెడ్డి.. ముత్యాలమ్మవీధిలో ఆ యువతిని ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి బలవంతంగా తాగించారు.

మూడ్రోజులు చిత్రహింసలకు గురి చేస్తూ లైంగిక దాడి చేశారు. ఆమె తలను గోడ కు బాదారు. బాధితురాలి కేకలు విని సోమ వారం చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వెళ్లి చూశా రు. ఆ యువతి కుటుంబీకులు తెలిసినవాళ్లే కావడంతో వెంటనే సమాచారం ఇచ్చారు. అప్పటికే యువతి గురించి వెతుకుతున్న కు టుంబీకులు అక్కడికి వచ్చే సరికి నిందితులు పరారయ్యారు. బాధిత కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించింది. గాయాలతో ఉ న్న యువతిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయిరాంరెడ్డి, గౌస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ వార్డు కౌన్సిలర్‌ కుమారుడని తెలిసింది.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top