ఇద్దరి మృతదేహాలు లభ్యం

Two Bodies found in auto and lorry accident - Sakshi

మరో ముగ్గురి ఆచూకీ కోసం బీరాపేరు వాగులో గాలింపు

సంగం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపై బీరాపేరు వంతెన వద్ద గురువారం రాత్రి ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో వాగులో గల్లంతైన ఐదుగురిలో ఇద్దరి మృతదేహాలను శనివారం గుర్తించారు. గురువారం రాత్రి నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లు, ఫైర్‌ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహించారు.

ప్రమాదంలో గల్లంతైన కర్రా పుల్లయ్య(60), కర్రా నాగరాజు (40) మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. కర్రా పుల్లయ్య, కర్రా నాగరాజు తండ్రి, కొడుకు కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. కర్రా సంపూర్ణమ్మ, కర్రా పద్మ, దివానపు ఆదెమ్మ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. వారి ఆచూకీ కోసం ఫైబర్‌ బోట్లు, నాటు పడవలతో, వలలతో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top