ఏటీఎం పేల్చి రూ.28 లక్షలు చోరీ  | Thugs Make Blast at ATM In Pune, Flee With Rs 28 Lakh | Sakshi
Sakshi News home page

ఏటీఎం పేల్చి రూ.28 లక్షలు చోరీ 

Jul 22 2021 12:41 AM | Updated on Jul 22 2021 12:41 AM

Thugs Make Blast at ATM In Pune, Flee With Rs 28 Lakh - Sakshi

సాక్షి ముంబై: పుణే జిల్లాలో ఓ ఏటీఎంను కొందరు దుండగులు పేల్చేశారు. అందులోని సుమారు రూ.28 లక్షలు చోరీ చేశారు. స్థానికంగా తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన వివరాలిలాఉన్నాయి.. పుణే జిల్లా చాకణ్‌ మహాలుంగే భాంబోలి ప్రధాన కుడలిలో హిటాచి కంపెనీ ఏటీఎం ఉంది.

ప్రధాన పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ ఏటీఎంను బుధవారం తెల్లవారుజాము 2.30 గంటలకు కొందరు దుండగులు పేలుడు పదార్థాలను వినియోగించి ధ్వసం చేశారు. అందులోని సుమారు 28 లక్షల రూపాయలు దొంగిలించి పరారయ్యారు. ఈ  తరహాలో ఏటీఎం చోరీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుడు కోసం వినియోగించిన పదార్థాలను నక్సలైటులు ఎక్కువగా వినియోగిస్తుంటారని ప్రాథమికం గా భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో నలుగురైదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement