ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

Published Wed, Dec 16 2020 9:27 AM

Three Man Deceased Road Accident At Prakasam District - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై లారీని ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బల్లికురవ మండలం అలనడక వాసులుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement