TDP Leaders Attack Sakshi Reporter In Mangalagiri - Sakshi
Sakshi News home page

మంగళగిరిలో సాక్షి రిపోర్టర్‌పై టీడీపీ గూండాల దాడి

Oct 19 2021 6:29 PM | Updated on Oct 19 2021 8:40 PM

TDP Leaders Attack Sakshi Reporter In Mangalagiri

సాక్షి, గుంటూరు: మంగళగిరిలో సాక్షి టీవీ రిపోర్టర్‌ అభిరామ్‌పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. న్యూస్‌ కవరేజీ కోసం వెళ్లిన అభిరామ్‌ని అసభ్య పదజాలంతో దూషించిన పచ్చ పార్టీ నేతలు.. చొక్కా పట్టుకుని కొట్టారు. అతని చైన్‌ దొంగిలించారు. అక్కడ నుంచి వెళ్లకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇష్టానుసారంగా దాడి చేయడంతో అభిరామ్‌కు గాయాలయ్యాయి. అభిరామ్‌పై దాడిని అడ్డుకోబోయిన మిగతా రిపోర్టర్లపై కూడా టీడీపీ నేతలు జులుం చూపించారు. వారిని నెట్టివేశారు. గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement