ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Road Accident In Ysr Kadapa District - Sakshi

సాక్షి, కడప: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్‌, టాటా సుమో, కారు ఢీకొనడంతో చేలరేగిన మంటల్లో నలుగురు సజీవదహనమవ్వగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. ఎర్రచందనం తరలిస్తున్న సుమోను టిప్పర్‌, కారు ఢీకొన్నాయి. స్మగ్లర్లు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నగర శివారుల వద్ద టిప్పర్ కంకరను అన్‌లోడు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సీఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద పరిస్థితి పోలీసులు సమీక్షిస్తున్నారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top