అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.. సడన్‌గా వారి మధ్య..

Orissa: Man Assassinated Friend Over Drunk Effect - Sakshi

రాయగడ: అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్న స్నేహితులు మధ్య మాటామాటా పెరిగింది. మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. జిల్లాలోని అంబోదల పోలీస్‌ స్టేషన్‌ పరిధి గడియాఖాల్‌ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గడియాఖాల్‌ గ్రామానికి చెందిన లుసిలి మాఝి(25), కిర్జో మాఝి(26) స్నేహితులు.

శనివారం ఉదయం కూలి పనులకు వెళ్లి, తిరిగి వస్తూ అలవాడు ప్రకారం ఈత కళ్లు తెచ్చుకొని పొలం సమీపంలో తాగుతున్నారు. ఇంతలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన లుసిలి.. ఒక కర్ర సాయంతో కిర్జోపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కిర్జో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

చదవండి: మాయలేడి: సోషల్‌ మీడియాలో యువకులకు వల.. నమ్మించి జేబు ఖాళీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top