పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి | Liguor Tragedy At West Champaran In Bihar | Sakshi
Sakshi News home page

పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి

Nov 5 2021 7:54 AM | Updated on Nov 5 2021 8:13 AM

Liguor Tragedy At West Champaran In Bihar - Sakshi

పట్నా: బిహార్‌లో దీపావళి పండుగ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ చంపారన్‌ ప్రాంతంలోని.. తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 24కి పెరిగింది. బాధితులంతా..  బుధవారం స్థానికంగా ఉన్న.. ఒక దుకాణంలో.. మద్యంసేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఈ క్రమంలో వీరిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో  స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

వీరిలో ఇప్పటికే.. ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా, మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్సపోందుతూ మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో మరికొందరిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బిహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ తీవ్ర ఆవేదన  వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

స్థానికి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 20 మందిపై అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement