గోదావరిలో మునిగి ఇద్దరు అమ్మాయిల మృతి  | Kothagudem: Two Girls Drown In Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో మునిగి ఇద్దరు అమ్మాయిల మృతి 

May 8 2021 12:30 AM | Updated on May 8 2021 12:30 AM

Kothagudem: Two Girls Drown In Godavari - Sakshi

సాక్షి, భద్రాచలం అర్బన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరిలో నీటమునిగి ఇద్దరు మృతి చెందారు. పట్టణం లోని కొత్త కాలనీకి చెందిన స్వాతి శుక్రవారం బట్టలు ఉతికేందుకు గోదావరికి వెళ్లారు. కూతురు మధు, మేనకోడలు ప్రవళిక కూడా ఆమెతోపాటు వెళ్లారు. అయితే స్వాతి బట్టలు ఉతుకుతున్న క్రమంలో మధు, ప్రవళిక గోదావరి నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement