యువతిని పొలంలోకి ఎత్తుకెళ్లి మేకల కాపరి దారుణం

యువతిపై ఘాతుకం.. ప్రేమోన్మాది అరెస్టు
తుమకూరు: ప్రేమించలేదని అమ్మాయిని దారుణంగా పొడిచి చంపిన దుండగున్ని శిర పోలీసులు అరెస్టు చేశారు. దొడ్డగోళ గ్రామంలో కావ్య అనే పీయూసీ విద్యార్థినిని మేకల కాపరి ఈరణ్ణ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసేవాడు. తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్నాడు. సోమవారం దొడ్డగోళ గ్రామంలోని ఇంటి నుంచి శిరలో కాలేజీకి వెళుతుండగా ఈరణ్ణ బైక్లో వచ్చి పక్కనే ఉన్న పొలంలోకి అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. అక్కడ కత్తితో దారుణంగా ముఖం, గొంతు, చేతులపై పొడవడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. పోలీసులు గాలించి నిందితున్ని అరెస్టు చేసి బైకు, కత్తి, ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి