మంత్రి గంగుల కమలాకర్‌కు నకిలీ ఈడీ నోటీసు

Fake ED Notice To Minister Gangula Kamalakar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి గంగుల కమలాకర్‌కు ఈడీ పేరిట నకిలీ నోటీసు పంపారు ఆగంతకులు. ఆయన సోదరులను అరెస్ట్‌ చేస్తామని, అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గంగుల ఈడీ అధికారులను సంప్రదించారు. ఈ నకిలీ నోటీసుపై ఈడీ అధికారులు సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తుల్లో భాగంగా సైబర్ క్రైమ్ మంత్రి గంగులకు ఫోన్‌ చేసింది. అయితే, ఈడీ నకిలీ నోటీసుపై మంత్రి గంగుల ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.

చదవండి : కేసీఆర్‌తోనే కుల వృత్తులకు పూర్వ వైభవం  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top