కోల్‌కతా నుంచి చెన్నై తరలిస్తున్న 25 కిలోల బంగారం సీజ్

DRI Seized 25 Kgs Of Gold At Pantangi Tollgate, Police Arrested Smugglers - Sakshi

కోల్‌కతా నుంచి చెన్నైకి తరలిస్తున్న స్మగ్ల్ర్లర్లు

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. చౌటప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 12 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలని కోల్‌కతా గోల్డ్‌ మాఫియా ముఠాకు అప్పగించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీంతో ముందస్తు సమచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారు బానెట్‌ భాగంలో కింది భాగంలో బంగారం అమర్చి తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. 

చదవండి : బంజారాహిల్స్‌లో పని మనిషి అరెస్టు
ప్రియురాలికి వేధింపులు.. ప్రియుడి అనుమానాస్పద మృతి
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top