‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఘరానా మోసం | Chittoor District : Fraud With Name Of Kaun Banega Crorepati | Sakshi
Sakshi News home page

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఘరానా మోసం

Sep 1 2020 7:09 PM | Updated on Sep 1 2020 7:15 PM

Chittoor District : Fraud With Name Of Kaun Banega Crorepati - Sakshi

సాక్షి, తిరుపతి : ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ పేరుతో మహిళను నిలువునా ముంచాడు ఓ మోసగాడు. 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని చెప్పి చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన మహిళకు కుచ్చు టోపి పెట్టాడు. రేణిగుంటకు చెందిన ఓ మహిళకు 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని ఫోన్‌ వచ్చింది. తొలుత 35 వేల రూపాలయలు చెల్లిస్తే లాటరీ డబ్బులు అందిస్తామని నమ్మబలికారు. మోసగాళ్ల మాయ మాటలు నమ్మిన మహిళ.. 35వేలను చెల్లించింది. ఆ తర్వాత జీఎస్టీ కోసం మరో 10 వేల రూపాయలు చెల్లించాలని పదేపదే ఫోన్లు చేశారు. దీంతో మహిళకు అనుమానం కలిగి.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement