ప్రాంతీయంగా 17 మత్స్య శాఖ సొసైటీలు ఉండగా, వాటిలో 900 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఏటా లీజులు చెల్లించి చెరువులను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎల్నినో తీవ్రతపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అవగాహన సదస్సులు నిర్వహించారు. సొసైటీలకు రాయితీతో రూ.2 చొప్పున 3.60 లక్షల చేప పిల్లలను అందించారు. అయితే, చెరువుల్లో అసలు నీళ్లే లేకపోవడంతో వేసిన చేప పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని, ఈ అరకొర సాయం తమను ఆదుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన తమ కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేకసాయం ద్వారా అండగా నిలవాలని కోరుతున్నారు.


