
గంగమ్మతల్లి ఆశీస్సులు అందాలి
పుంగనూరు: గంగమ్మతల్లి ఆశీస్సులు అందరికీ అందించి, అందరూ బాగుండేలా చూడాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రార్థించారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బాగేపల్లె గ్రామంలో గ్రామస్తులు నిర్మిస్తున్న నూతన గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్దిరెడ్డికి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో సరదాగా గడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భక్తిమార్గంలో పయణిస్తున్నారని కొనియాడారు. ప్రతి గ్రామంలోనూ రామాలయాలు, గంగమ్మ ఆలయాలు నిర్మించి, ఆధ్యాత్మికత వైపు పల్లెలు పయణిస్తుండడం అభినందనీయమన్నారు. గంగమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజ లంతా అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామమోహన్రెడ్డి, రాజారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.