రక్తహీనత రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రక్తహీనత రహిత సమాజమే లక్ష్యం

Apr 22 2025 1:51 AM | Updated on Apr 22 2025 1:51 AM

రక్తహీనత రహిత సమాజమే లక్ష్యం

రక్తహీనత రహిత సమాజమే లక్ష్యం

గంగాధరనెల్లూరు: రక్తహీనత రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ పీడీ వెంకటేశ్వరి అన్నారు. సోమవారం గంగాధర నె ల్లూరు మండలంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా గర్బిణులు, బాలింతలకు పౌష్డికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ పోషణ్‌ పక్వాడ్‌ కార్యక్రమంపై గ్రామాల్లో అవగాహన కల్పించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రక్తహీనత లేని సమాజాన్ని నిర్మూలించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, చిన్నారులకు పీడీ వెంకటేశ్వరి, సీడీపీఓ వినీతాశ్రీ, అన్నప్రాసన్న చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరిప్రసాద్‌రెడ్డి, ఎంఈఓ గుణశేఖర్‌రెడ్డి, సీహెచ్‌ఓలు శ్రీనివాసులు, జ్ఞానశేఖర్‌, సర్పంచ్‌ సుబ్రమణ్యం, పర్యవేక్షకులు అనురాధ, బిందు, మాలతి, నాగరత్నమ్మ, భాగ్యలక్ష్మి, సంగీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement