టాటా కార్లు మరింత ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కాస్త ప్రియం కానున్నాయి. మోడల్, వేరియంట్ను బట్టి ధర సగటున 0.6 శాతం పెరగనుంది. మే 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది.
2023 ఫిబ్రవరి తర్వాత ధరలు పెంచడం ఇది రెండవసారి. నియంత్రణపర మార్పులు, ముడిసరుకు వ్యయం అధికం కావడం తాజా నిర్ణయానికి దారి తీసిందని టాటా మోటార్స్ తెలిపింది.
మరిన్ని వార్తలు