సుజుకి మోటార్సైకిల్ ఇండియా.. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను పరిచయం చేయడం, భవిష్యత్ మొబిలిటీ పరిష్కారాలపై నూతన దృష్టి సారించడం వంటివి చేయడం వల్ల కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.
సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఈ కంపెనీ.. మొత్తం 10 మిలియన్ల ద్విచక్ర వాహనాల ఉత్పత్తి మైలురాయిని దాటినట్లు అధికారికంగా ప్రకటించింది. స్థిరమైన వినియోగదారుల డిమాండ్.. నిరంతర ఉత్పత్తి ఆవిష్కరణల మద్దతుతో, గత నాలుగేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని సంస్థ వెల్లడించింది.
సుజుకి మోటార్సైకిల్ ఇండియా ప్రస్తుతం పటిష్టమైన సరఫరాదారుల వ్యవస్థ మద్దతుతో, భారతదేశం అంతటా 1,200కు పైగా టచ్పాయింట్లతో కూడిన విస్తృత నెట్వర్క్ను నిర్వహిస్తోంది. భారతదేశంలో దీని ప్రయాణం 2006లో సుజుకి హీట్ 125 మరియు సుజుకి జీయస్ 125 వంటి మోటార్సైకిళ్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2007లో సుజుకి యాక్సెస్ 125ను విడుదల చేశారు. ఈ మోడల్ అమ్మకాలలో కీలక పాత్ర పోషించి, 125cc స్కూటర్ విభాగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సహాయపడింది.
ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!
కాలక్రమేణా..సుజుకి గిక్సర్ సిరీస్, సుజుకి వి-స్ట్రోమ్ SX వంటి మోటార్సైకిళ్లతో పాటు, సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్, సుజుకి అవెనిస్ వంటి ఉత్పత్తులతో సుజుకి తన పోర్ట్ఫోలియోను మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. సుజుకి హయబుసా, సుజుకి GSX-8R వంటి దాని ప్రీమియం మోడళ్లు, వివిధ విభాగాలలో దాని ఉనికిని మరింత బలోపేతం చేశాయి.


