Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫెడ్‌ మీటింగ్‌ ప్రభావం.. లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Thu, Mar 21 2024 9:12 AM

Stock Market Rally On Today Opening  - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 22,011కు చేరింది. సెన్సెక్స్‌ 567 పాయింట్లు పుంజుకుని 72,659 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 103.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 86.2 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.9 శాతం, నాస్‌డాక్‌ 1.25 శాతం లాభపడ్డాయి.

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం బుధవారం రాత్రితో ముగిసింది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు పెరిగాయి. ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ 2024 ముగిసే వరకు మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు. ఇప్పటికే మార్కెట్‌ చాలా పడిపోయింది కాబట్టి ఈ వ్యవహారాన్ని మార్కెట్‌ పాజిటివ్‌గానే తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

What’s your opinion

Advertisement