సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Feb 27 2024 4:23 PM | Updated on Apr 18 2024 12:06 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్‌ సూచీలోని సెన్సెక్స్‌ ఉదయం 72,723.53 పాయింట్లతో ప్రారంభమైంది. తరువాత ఇంట్రాడేలో 73,161.30 పాయింట్ల మార్కును తాకి లాభాలకు చేరింది. చివరకు 305.09 పాయింట్లు పెరిగి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 76.30 పాయింట్లు పెరిగి 22,198.35 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.

సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్ ఇండ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement