ఐపీవో స్ట్రీట్‌ ...లిస్టింగ్‌కు కంపెనీల క్యూ  | Rayzon Solar, Credila Financial and Shadowfax Technologies movie to IPO | Sakshi
Sakshi News home page

ఐపీవో స్ట్రీట్‌ ...లిస్టింగ్‌కు కంపెనీల క్యూ 

Jun 29 2025 4:40 AM | Updated on Jun 29 2025 4:40 AM

Rayzon Solar, Credila Financial and Shadowfax Technologies movie to IPO

సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ దాఖలు 

జాబితాలో క్రెడిలా ఫిన్‌ సరీ్వసెస్‌ 

షాడోఫ్యాక్స్, రేజన్‌ సోలార్‌ సైతం

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తుండటంతో గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం పలు దిగ్గజాలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుండగా.. మరిన్ని కంపెనీలు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..  

రూ. 5,000 కోట్లకు రెడీ 
గత డిసెంబర్‌లో గోప్యతా విధాన పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టిన విద్యా సంబంధ రుణాలందించే క్రెడిలా ఫిన్‌ సర్వీసెస్‌ సెబీకి తాజాగా అప్‌డేటెడ్‌ డాక్యుమెంట్లు అందించింది. గత నెలలో అనుమతి పొందిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధపడుతోంది. ఇష్యూలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్‌ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ రూ. 1,050 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్‌ చేయనుంది. 

ఐపీవోకంటే ముందుగా రూ. 600 కోట్ల సమీకరణపై కంపెనీ కన్నేసింది. దీంతో ఐపీవోలో ఇష్యూ పరిమాణం ఆ మేర తగ్గే అవకాశముంది. 2006లో ఏర్పాటైన కంపెనీ నిధులను భవిష్యత్‌లో బిజినెస్‌ వృద్ధికి అవసరమయ్యే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. విద్యా సంబంధ రుణాలపై అధికంగా దృష్టిసారించే ఎన్‌బీఎఫ్‌సీలో హెచ్‌డీఎఫ్‌సీ 2009లో ఇన్వెస్ట్‌ చేసింది. 2010 నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. అయితే 2023లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మాతృ సంస్థ విలీనంకావడంతో ఈక్యూటీ, క్రిస్‌క్యాపిటల్‌ గ్రూప్‌లు ఉమ్మడిగా 2024 మార్చిలో 90 శాతం వాటాను కొనుగోలు చేశాయి.  

రూ. 1,500 కోట్లకు సై 
పునరుత్పాక ఇంధన రంగంలో కార్యకలాపాలు కలిగిన రేజన్‌ సోలార్‌ స్టాక్‌ ఎక్సే్చంజీలలో లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా గుజరాత్‌ కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 300 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవో పరిమాణం తగ్గనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,265 కోట్లు సొంత అనుబంధ సంస్థ రేజన్‌ ఎనర్జీపై వెచి్చంచనుంది. 

తద్వారా 3.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు ఆర్థికంగా దన్నునివ్వనుంది. సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ తయారీలో కార్యకలాపాలు విస్తరించిన రేజన్‌ సోలార్‌ 2017లో ప్రారంభమైంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యానసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా, కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ, మైక్రోటెక్‌ ఇంటర్నేషనల్, అక్మే క్లీన్‌టెక్‌ సొల్యూషన్స్, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ తదితర కంపెనీలకు సేవలందిస్తోంది. గతేడాది   (కేలండర్‌ 2024)లో రూ. 1,957 కోట్ల ఆదాయం, రూ. 239 కోట్ల నికర లాభం ఆర్జించింది. 

వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌ 
హోమ్‌ అండ్‌ ఫరీ్నíÙంగ్స్‌ కంపెనీ వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో రూ. 468 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా 5.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2016లో ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 145 కోట్లు ప్రస్తుత స్టోర్ల లీజ్‌తోపాటు, లైసెన్స్‌ ఫీజు చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 82 కోట్లు 117 కోకో రెగ్యులర్‌ స్టోర్లతోపాటు ఒక జుంబో స్టోర్‌ ఏర్పాటుకు, రూ. 15 కోట్లు కొత్త పరికరాలు, మెషీనరీ కొనుగోలుకీ వెచి్చంచనుంది. ఈ బాటలో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ఇతర వ్యయాలకు కేటాయించనుంది. 2023–24లో రూ. 986 కోట్లకుపైగా ఆదాయం సాధించింది. 

సుదీప్‌ ఫార్మా ఐపీవో బాట 
ఔషధ రంగ కంపెనీ సుదీప్‌ ఫార్మా పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 1,00,76,492 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 76 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. గుజరాత్‌లోని నందెసారి యూనిట్‌లో ఉత్పత్తికి వీలుగా మెషీనరీ కొనుగోలుకి నిధులు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. 

1989లో ఏర్పాటైన  వడోదర సంస్థ సుదీప్‌ ఫార్మా ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్‌ అంట్‌ న్యూట్రిషన్‌లో కార్యకలాపాలు విస్తరించింది. కలరింగ్‌ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్‌ విభాగంలో 100 రకాల ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్‌ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. వడోదరలోగల మూడు యూనిట్ల ద్వారా మొత్తం 65,579 మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ క్లయింట్ల జాబితాలో ఫార్మా రంగ దిగ్గజాలు ఫైజర్, ఇన్‌టాస్‌ ఫార్మా, మ్యాన్‌కైండ్‌ ఫార్మా, మెర్క్‌ గ్రూప్, క్యాడిలా ఫార్మా, మైక్రో ల్యాబ్స్‌తోపాటు ఫ్రెంచ్‌ దిగ్గజం గ్రూప్‌ దానోన్‌ చేరింది. గత క్యాలండర్‌ ఏడాది(2024)లో ఆదాయం రూ. 344 కోట్లను అధిగమించగా, దాదాపు రూ. 95 కోట్ల నికర లాభం ఆర్జించింది.

రూ. 2,500 కోట్లపై చూపు 
దిగ్గజాలు టీపీజీ, ఫ్లిప్‌కార్ట్, మిరాయ్‌ అసెట్స్‌ తదితరాలకు పెట్టుబడులున్న ఈకామర్స్‌ కంపెనీ షాడోఫ్యాక్స్‌ వచ్చే వారం సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తద్వారా రూ. 2,500 కోట్లవరకూ సమకూర్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు కొత్తగా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్‌వర్క్‌పై వినియోగించనుంది. 2015లో ఏర్పాటైన కంపెనీ ఫిబ్రవరిలో సుమారు రూ. 6,000 కోట్ల విలువలో నిధులను సమీకరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement