పేటీఎమ్‌కు సెబీ ఝలక్‌  | Paytm gets SEBI warning over related party transactions with payment | Sakshi
Sakshi News home page

పేటీఎమ్‌కు సెబీ ఝలక్‌ 

Jul 17 2024 12:16 PM | Updated on Jul 17 2024 12:42 PM

Paytm gets SEBI warning over related party transactions with payment


పాలనా సంబంధ హెచ్చరికలతో లేఖ 

న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్‌97 కమ్యూనికేషన్స్‌ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్‌ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్స్‌(పీపీబీఎల్‌)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్‌పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్‌ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్‌ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. 

అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్‌ బ్రాండ్‌ డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్‌97 కమ్యూనికేషన్స్‌ సంబంధ ఫైనాన్షియల్‌ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్‌ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్‌పీటీలలో పేటీఎమ్‌ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్‌తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్‌97 బీఎస్‌ఈకి తెలియజేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement