అంధుల జీవితాల్లో వెలుగులు.. రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన నీతా అంబానీ | Nita Ambani attends NABs 75th anniversary | Sakshi
Sakshi News home page

అంధుల జీవితాల్లో వెలుగులు.. రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన నీతా అంబానీ

Jan 21 2026 10:20 PM | Updated on Jan 22 2026 5:14 PM

Nita Ambani attends NABs 75th anniversary

నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (NAB) ఇండియా 75వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంధులకు అండగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున రాబోయే ఐదేళ్లలో రూ.5 కోట్ల విరాళాన్ని అందజేస్తామని నీతా అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్, నాబ్‌ సంయుక్త కృషితో ఇప్పటివరకు 22,000 మందికి పైగా అంధులకు చూపు తెప్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement