సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ సూచీలు

Published Wed, Feb 14 2024 3:48 PM

Nifty At 21,850, Sensex Up 278 Points - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్‌లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్ల లాభంతో 71,833.17 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 96 పాయింట్లు పెరిగి 21,840 వద్ద ముగించింది. 

నిఫ్టీలో బీపీసీఎల్‌, ఎస్‌బిఐ, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా, టీసీఎస్‌, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి.

సెక్టోరల్‌లో, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి, ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియల్టీ షేర్లు ఒక్కొక్కటి 1.2 శాతం పెరిగాయి. మరోవైపు ఐటీ, ఫార్మా సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి.

Advertisement
Advertisement