Sakshi News home page

రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ను దాటిన మలబార్‌

Published Sat, Apr 13 2024 4:58 AM

Malabar Gold and Diamonds Achieves Record Annual Turnover Exceeding Rs 50,000 Crore - Sakshi

హైదరాబాద్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ రూ.50 వేల కోట్లను మించి రికార్డు వార్షిక టర్నోవర్‌ సాధించిందని సంస్థ చైర్మన్‌ ఎం.పి. అహమ్మద్‌ తెలిపారు. సోమాజిగూడ మలబార్‌ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ లగ్జరీ ప్రోడక్ట్స్‌లో మలబార్‌ గ్రూప్‌ 19వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.

గత ఆర్థిక సంవత్సరం రూ.51,218 కోట్ల వార్షిక రిటైల్‌ గ్లోబల్‌ టర్నోవర్‌ సాధించింది’’ అన్నారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికల్లో భాగంగా దేశ, విదేశాల్లో వచ్చే ఏడాదిలో 100 కొత్త షోరూములు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా అదనంగా 7 వేల మందికి ఉపాధి కలి్పస్తామని అహమ్మద్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement