Reliance Jio: 75వ ఇండిపెండెన్స్‌ డే: జియో కొత్త రీచార్జ్‌ ప్లాన్‌

Jio launches Rs 750 prepaid plan with 2GB data per day - Sakshi

ముంబై:  భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా   టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో కొత్త ప్లాన్‌నులాంచ్‌ చేసింది. తన కస్టమర్లకోసం రూ.750 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇందులో రోజుకు 2జీబీ డేటా వినియోగదారులు వాడుకోవచ్చు. (YouTube: మరో బంపర్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేయనున్న యూట్యూబ్‌)

ఈ రీఛార్జ్ ప్యాక్  ఇతర ప్రయోజనాలను పరిశీలిస్తే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్‌, ప్రతిరోజూ 100 SMSలు, Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 90 రోజులు.ఈ ప్లాన్ ఇప్పటికే జియో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు  కొత్త ప్లాన్  MyJio యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఇటీవల జియో రూ. 2,999 విలువైన వార్షిక రీఛార్జ్ ప్లాన్‌తీసుకొచ్చినసంగతి తెలిసిందే. తాజాగా మరో స్వాతంత్ర్య దినోత్సవ  ఆఫర్‌ను జియో వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. 

రూ. 750 ప్రీపెయిడ్ ప్లాన్‌
ఏనెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్‌
రోజుకు 2 జీబీ డేటా
ప్రతిరోజూ 100 SMSలు
90రోజుల వాలిడిటీ

చదవండివీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్‌సైట్‌, డౌన్‌లోడ్‌ లింక్‌ బ్లాక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top