Kia India Sets New Milestone By Exporting 2 Lakh Units Mark In FY23 - Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన కియా ఎగుమతులు.. ఆ మోడల్‌కి డిమాండ్ ఎక్కువ

Apr 27 2023 6:42 AM | Updated on Apr 27 2023 9:42 AM

Huge increase in kia exports - Sakshi

న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా 2 లక్షల ఎగుమతుల మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 95 దేశాలకు కార్లను ఎగుమతి చేసినట్లు సంస్థ వెల్లడించింది. మధ్యప్రాచ్యం, మెక్సికో తదితర ప్రాంతాల నుంచి భారీ డిమాండ్‌ నెలకొందని తెలిపింది. ఎగుమతుల్లో సెల్టోస్‌ కార్లు అత్యధికంగా 1,35,885 యూనిట్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. 2023 మార్చి త్రైమాసికంలో ఎగుమతులు 22% పెరిగినట్లు వివరించింది.  

Advertisement
 
Advertisement
Advertisement