పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో భారీ నష్టాలు? | Petrol Diesel Sales Turning Costly for OMCs Rs 20 Loss Per Litre | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో భారీ నష్టాలు?

Mar 5 2026 4:22 PM | Updated on Mar 5 2026 4:45 PM

Petrol Diesel Sales Turning Costly for OMCs Rs 20 Loss Per Litre

దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్‌, డీజిల్ అమ్మకాలపై భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క లీటర్ ఇంధన విక్రయంపై సుమారు రూ.20 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ రంగ దిగ్గజాలు అయిన ఐఓసీఎల్ (Indian Oil Corporation), హెచ్‌పీసీఎల్ (Hindustan Petroleum Corporation Limited), బీపీసీఎల్ (Bharat Petroleum Corporation Limited) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

మార్జిన్‌లపై ప్రతికూల ప్రభావం
స్థూల మార్కెటింగ్ మార్జిన్ అంటే ఇంధనాల రిటైల్ విక్రయ ధర, వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే వరకు అయ్యే మొత్తం ఖర్చు మధ్య వ్యత్యాసం. ప్రస్తుతం ఈ మార్జిన్ ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అదే సమయంలో రూపాయి బలహీనపడటం ఓఎంసీలపై ద్వంద్వ ప్రభావాన్ని చూపుతున్నాయి.

రూపాయి పతనం, క్రూడ్ ధరల పెరుగుదల
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ సుమారు 2 శాతం తగ్గింది. మరోవైపు బెంచ్‌మార్క్ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 33 శాతం పెరిగి 80 డాలర్లకు పైగా చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో హెచ్‌సీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ షేర్లు గణనీయంగా పడిపోయాయి.

క్రూడ్ ధరల పెరుగుదలతో లాభాల క్షీణత
చమురు మార్కెటింగ్ కంపెనీల లాభదాయకత సాధారణంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలకు విలోమంగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1 డాలర్ పెరిగితే, ఈ సంస్థల స్థూల మార్కెటింగ్ మార్జిన్ లీటరుకు సుమారు రూ.0.5 వరకు తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు మించి కొనసాగితే, మార్జిన్‌లు లీటరుకు సుమారు రూ.3.5 వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కంపెనీల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు ఈ వారం ప్రారంభంలోనే పెరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా సంయుక్త వైమానిక దాడులు జరిపిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇరాన్ కీలక చమురు ఉత్పత్తి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే హార్మూజ్‌ జలసంధిలో నౌకల రవాణాను అడ్డుకుంటామని హెచ్చరించడం ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళనలను పెంచింది.

భారత దిగుమతులపై ప్రభావం?
భారత్‌ రోజుకు సుమారు 2.5–2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్‌, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటా కలిగి ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు కొనసాగితే దేశీయ చమురు మార్కెట్‌పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement