Budget 2024-25: రాష్ట్రపతిని కలిసిన నిర్మలమ్మ - ఫోటోలు | FM Nirmala Sitharaman Meets President Droupadi Murmu At Rashtrapati Bhavan Before To Present Budget, Photos Inside - Sakshi
Sakshi News home page

Budget 2024-25: రాష్ట్రపతిని కలిసిన నిర్మలమ్మ - ఫోటోలు

Feb 1 2024 10:50 AM | Updated on Feb 1 2024 2:15 PM

FM Sitharaman Meets President Murmu Photos - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024-25 ఆర్థిక సంవత్సరానికి కోసం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అంతకంటే ముందు రాష్ట్రపతి 'ద్రౌపది ముర్ము'ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిసిన ఫోటోలను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, శ్రీ పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా ముర్ము కేంద్ర ఆర్థిక మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు, కార్మికులకు, నిరుద్యోగ యువతతో పాటు మహిళా విభాగాలకు సానుకూల ప్రతిపాదనలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. మధ్యంతర బడ్జెట్ 2024 కేవలం "ఓట్ ఆన్ అకౌంట్" మాత్రమేనని, నిజమైన యూనియన్ బడ్జెట్ 2024ని ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెబుతున్నారు. మరిన్ని 2024-25 బడ్జెట్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement