Bengaluru tops the list with Rs 6,500 crore in digital transactions in India - Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపుల జోరు

Apr 19 2023 7:38 AM | Updated on Apr 19 2023 12:35 PM

Bengaluru 29 Million Transactions Valued At Rs 6,500 Crore Country - Sakshi

చెన్నై: దేశీయంగా గతేడాది డిజిటల్‌ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిల్చింది. 2022లో 65 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 2.9 కోట్ల లావాదేవీలతో టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. పేమెంట్‌ సర్వీసుల సంస్థ వరల్డ్‌లైన్‌ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.

 నివేదిక ప్రకారం న్యూఢిల్లీ (1.96 కోట్ల లావాదేవీలు, 50 బిలియన్‌ డాలర్ల విలువ), ముంబై (1.87 కోట్ల లావాదేవీలు, 49.5 బిలియన్‌ డాలర్ల విలువ), చెన్నై (1.43 కోట్ల లావాదేవీలు, 35.5 బిలియన్‌ డాలర్ల విలువ), పుణే (1.5 కోట్ల లావాదేవీలు, 32.8 బిలియన్‌ డాలర్ల విలువ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

గత కొన్నేళ్లుగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో అద్భుతమైన పురోగతి నమోదవుతోందని వరల్డ్‌లైన్‌ ఇండియా సీఈవో రమేష్‌ నరసింహన్‌ తెలిపారు. దేశీయంగా నగదు చలామణీని తగ్గించే దిశగా చెల్లింపులకు సంబంధించి బహుళ సాధనాలు అందుబాటులోకి రావడం మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement