రెండు ఇసుక టిప్పర్లు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

రెండు ఇసుక టిప్పర్లు సీజ్‌

Mar 25 2025 1:27 AM | Updated on Mar 25 2025 1:26 AM

పాల్వంచరూరల్‌: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్‌ వాహనాలను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. తహసీల్దార్‌ వివేక్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని భోజ్యాతండా సమీపంలోని మొర్రేడు వాగు చెక్‌డ్యామ్‌ వద్ద నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందగా రూరల్‌ ఆర్‌ఐ నళిని కుమార్‌, పోలీస్‌ సిబ్బంది సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. ఒక రోజు ముందు తీసుకున్న అనుమతి కాగితాలతో రవాణా చేస్తుండగా టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.

టేకులపల్లిలో ట్రాక్టర్‌...

టేకులపల్లి: మండలంలోని శంభునిగూడెం వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను సోమవారం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించి, ఇసుక రవాణా చేస్తున్న బిల్లుడుతండాకు చెందిన అజ్మీర మాన్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.సురేష్‌ తెలిపారు.

చండ్రుగొండలో రెండు ట్రాక్టర్లు..

చండ్రుగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్న ఎదుళ్లవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ సోమవారం రాత్రి తెలిపారు. వాహనాలను స్టేషన్‌కు తరలించామని, డ్రైవర్లు నర్సింహారావు, హేమంత్‌లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో మండలవాసి మృతి

దుమ్ముగూడెం : మండలంలోని సున్నంబట్టి గ్రామానికి చెందిన బంటు రాజ్‌కుమార్‌ (18) హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై హైవేపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రాజ్‌కుమార్‌ మృతితో సున్నంబట్టి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పశువులు పట్టివేత

టేకులపల్లి: మండలంలోని తడికలపూడి క్రాస్‌ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు పశువులను స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ వాహనం సీజ్‌ చేసి, నిందితులు గరుడపల్లి లాలయ్య, మొరం నాగరాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.సురేష్‌ తెలిపారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

కరకగూడెం: మండల పరిధిలోని బర్దారం అటవీ ప్రాంతంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. వారి నుంచి రెండు సెల్‌ ఫోన్లు, రూ.7వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కరకగూడెం ఎస్సై రాజేందర్‌ తెలిపారు.

జేసీబీ స్వాధీనం

దమ్మపేట : అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న జేసీబీ యంత్రాన్ని రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. మండలంలోని గట్టుగూడెం గ్రామశివారులో అనుమతులు లేకుండా జేసీబీ యంత్రంతో మట్టి తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారనే సమాచారం రెవెన్యూ అధికారులకు అందింది. దీంతో రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి, సీజ్‌ చేశామని ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ కె.వాణి తెలిపారు.

రెండు ఇసుక టిప్పర్లు సీజ్‌1
1/2

రెండు ఇసుక టిప్పర్లు సీజ్‌

రెండు ఇసుక టిప్పర్లు సీజ్‌2
2/2

రెండు ఇసుక టిప్పర్లు సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement