జలసంరక్షణలో జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

జలసంరక్షణలో జాతీయ అవార్డు

Jun 18 2023 12:10 AM | Updated on Jun 18 2023 11:32 AM

- - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం) : జల సంరక్షణ విభాగంలో ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రాగా, ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ ప్లీనరీ హాల్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్‌ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్‌ గడ్డం భవాని, కార్యదర్శి షేక్‌ ఇబ్రహీం శనివారం పురస్కారం స్వీకరించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీల్లో 41 మంది విజేతలను ప్రకటించగా జల సంరక్షణలో ఉత్తమ పంచాయతీగా జగన్నాథపురం నిలిచిన విషయం తెలిసిందే.

గ్రామానికి అవార్డు రావడం పట్ల కలెక్టర్‌ అనుదీప్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రశంసపత్రంతో పాటు నగదు బహుమతి అందుకున్నారని తెలిపారు. జాతీయస్థాయిలో జల సంరక్షణలో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సహకరించిన ప్రజలను ఆయన అభినందించారు. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులు అందజేస్తున్నారని పేర్కొన్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement