పారా మెడికల్‌ విద్యార్థుల నిరసన ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

పారా మెడికల్‌ విద్యార్థుల నిరసన ర్యాలీ

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు ఇచ్చిన హామీతో ఒప్పంద ఆధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలను విరమించుకుంటున్నట్లు వర్సిటీ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ తిరుమలరావు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సుమారు 20 ఏళ్ళుగా సేవలందిస్తున్న ఒప్పంద అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల రిలే నిరాహార దీక్షలు గురువారం 44వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల వేతన పెంపుపై ఉత్తర్వులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఇటీవల కమిటీ సమర్పించిన వేతన పెంపు నివేదికను రాబోయే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదింపజేసి, ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని వీసీ ఆచార్య కె.గంగాధరరావు హామీ ఇచ్చారన్నారు. ఈ రిలే నిరాహారదీక్షలను రెక్టార్‌ ఆచార్య ఆర్‌.శివరాం ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సింహాచలం, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, నూట అధ్యక్షుడు ఆచార్య పి.బ్రహ్మాజీరావు ఒప్పంద అధ్యాపకుల నిరసన టెంట్‌ వద్దకు చేరుకుని వారితో మాట్లాడి నిమ్మరసం అందించి శాంతియుత ఆందోళనను విరమింపజేశారు. ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఒకరు మృతి

గుంటూరు మెడికల్‌: గుంటూరు జిల్లాలో బీఎస్సీ ఎంఎల్టీ అండ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) గుంటూరు జిల్లా కన్వీనింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ గురువారం రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ నుంచి బీఆర్‌ స్టేడియం, టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన బీఎస్సీ ఎంఎల్టీ అండ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కోర్సులు అనేక కారణాల వల్ల ఆరు సంవత్సరాలకు పొడిగించ బడుతున్నాయన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా కన్వీనర్‌ షేక్‌ సమీర్‌ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం, సంబంధిత విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు చెలగాటం ఆడటం సరికాదన్నారు.

వీసీ హామీతో రిలే నిరాహార దీక్షలు విరమణ

మాచర్ల రూరల్‌ వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని జమ్మలమడక గ్రామ సమీపంలో గురువారం జరిగింది. వివరాలలోకి వెళితే.. జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల చిన మల్లయ్య (53) మాచర్ల వెళ్తుండగా తుమృకోట గ్రామానికి చెందిన మద్దిపట్ల సైదయ్య మాచర్ల నుంచి తుమృకోటకు వెళ్తుండగా జమ్మలమడక గ్రామ సమీపంకు రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో కూరాకుల చిన మల్లయ్య తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలో మృతిచెందాడు. చంద్రయ్యకు తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement