న్యూస్రీల్
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు నూతన వస్త్రాలను బహూకరించగా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దుశ్శాలువాతో వైఎస్ జగన్ను సన్మానించారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్కుమార్, షేక్ నూరి ఫాతిమా, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, వరికూటి అశోక్బాబు, పి. నాగమోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


