ఏఎన్‌యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

Mar 11 2026 7:46 AM | Updated on Mar 11 2026 7:46 AM

● మార్చి 15న ప్రవేశ పరీక్ష...తత్కాల్‌ ఫీజుతో అదే రోజు పరీక్షకు హాజరుకు వెసులుబాటు ● రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు..ఏపీ ఐసెట్‌ ర్యాంకర్లకు నేరుగా ప్రవేశాలు ● ఈనెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ● ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేయని అభ్యర్థులు నేరుగా టెనన్త్‌ క్లాస్‌, డిగ్రీ ప్రొవిజినల్‌, మార్కుల జాబితా అభ్యర్థి ఫొటోతో పాటు రూ.500 తత్కాల్‌ ఫీజు చెల్లించి, 15వ తేదీన పరీక్ష కేంద్రాల్లో నేరుగా హాజరు కావచ్చన్నారు. ● సంబంధిత ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈనెల 17వ తేదీన సాయంత్రం విడుదల చేయడం జరుగుతుందన్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్‌ సంవత్సరానికి రెండేళ్ళ మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్‌ ఆచార్య దిట్టకవి రామచంద్రన్‌ విడుదల చేశారు.

ప్రవేశ పరీక్ష కేంద్రాలు:

సెంటర్‌ ఫర్‌ డిస్టెనన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్‌ (కాకినాడ), ఎంఎస్‌ఆర్‌ఎస్‌ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్‌ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్‌ (ఒంగోలు), గేట్‌ డిగ్రీ కాలేజ్‌ (తిరుపతి), విజయ దుర్గ డిగ్రీ కాలేజ్‌ (కర్నూలు), ఇంటెల్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ (అనంతపూర్‌), విజ్ఞాన్‌ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్‌ డిగ్రీ కాలేజ్‌ (మాచర్ల), ఎస్బీఎస్‌వైఎం డిగ్రీ కాలేజ్‌( మైదుకూరు), ప్రభాస్‌ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్‌ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం) మొత్తం 12 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.

ఏపీ ఐసెట్‌ 2025లో అర్హులకు మినహాయింపు..

ఏపీ ఐసెట్‌–2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను, ర్యాంక్‌ కార్డులు పొందవచ్చని దిట్టకవి ఆచార్య రామచంద్రన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement