శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

Aug 20 2025 12:36 PM | Updated on Aug 20 2025 12:36 PM

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తాడికొండ: అమరావతి రాజధానిలోని వేంకటపాలెంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహించారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధివాసం, సర్వదైవత్య హోమం చేపట్టారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ మల్లికార్జున, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, సందీప్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement