
వరద ఉధృతం.. భయం భయం
దాచేపల్లి మండలం రామపురం మత్స్యకారుల కాలనీకి చేరువలోకి వరద భయం గుప్పిట్లో గ్రామస్తులు
దాచేపల్లి: కృష్ణా నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మత్స్యకారుల కాలనీ ప్రమాదం అంచున ఉంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామపురం గ్రామంలోని మత్స్యకారుల కాలనీ అనుకొని కృష్ణానదిలో వరద నీరు మంగళవారం ఉధృతంగా ప్రవహిస్తుంది. కాలనీలోని నివాస గృహాలకు కూతవేటు దూరంలో వరద నీరు ప్రవహిస్తుండంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాలనీలో 50 పైగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడం వలన నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి విడుదల పెరిగితే మత్స్యకారుల కాలనీలోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగితే మత్స్యకారులను అక్కడి నుంచి ఖాళీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.