
అవగాహన ఫ్లెక్సీ ఆవిష్కరణ
గుంటూరు మెడికల్: ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ప్రచార ఫ్లెక్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ఉదయం 9 గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ శివశంకర్ బాబు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, డీపీహెచ్ఎన్ డాక్టర్ ప్రియాంక, స్టాటిస్టికల్ అధికారిణి పద్మజ, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజు నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి గణేష్, తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరిలో
ఇన్నోవేషన్ హబ్
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
మంగళగిరి టౌన్: యువతలోని వినూత్న ఆలోచనలను మెరుగుపట్టి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ను మంగళగిరిలో ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న మయూరి టెక్ పార్క్లో ఈ హబ్ ఏర్పాటైంది. దీనిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. యువతకు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ తెలిపారు.

అవగాహన ఫ్లెక్సీ ఆవిష్కరణ