మాజీ సర్పంచ్‌పై కానిస్టేబుల్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌పై కానిస్టేబుల్‌ దాడి

Aug 10 2025 5:52 AM | Updated on Aug 10 2025 5:52 AM

మాజీ

మాజీ సర్పంచ్‌పై కానిస్టేబుల్‌ దాడి

బెల్లంకొండ: వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో బైక్‌ ఆపలేదనే కోపంతో మాజీ సర్పంచ్‌పై ఓ కానిస్టేబుల్‌ లాఠీ ఝుళిపించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం మండలంలోని నాగిరెడ్డిపాలెం సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు నాగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్‌ కొజ్జా శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంకొండ క్రాస్‌ రోడ్డు నుంచి బైక్‌పై నాగిరెడ్డిపాలెం వస్తుండగా గంగమ్మ గుడి సమీపంలో కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. బైక్‌ ఆపకుండా ముందుకు వెళ్లడంతో తనిఖీ చేస్తున్న కానిస్టేబుళ్లలో ఒకరు శ్రీనివాసరావుపై లాఠీ విసిరారు. దీంతో ముఖంపై గాయ మై రక్తస్రావం అయింది. ఊర్లోకి గాయంతో వచ్చిన శ్రీనివాసరావును చూసి కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు నాగిరెడ్డిపాలెం ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న క్రోసూరు, సత్తెనపల్లి సీఐలు ప్రత్తిపాటి సురేష్‌, కిరణ్‌లు నాగిరెడ్డిపాలెం వచ్చి బాధితుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశా రు. దాడి చేసిన కానిస్టేబుల్‌ రావాలని, కొట్టడానికి గల కారణం చెప్పాలని బాధితుడి కుటుంబ సభ్యు లు భీష్మించుకుని కూర్చున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని, పోలీస్‌స్టేషన్లో మాట్లాడదామని సీఐలు సర్ది చెప్పారు. బాధితుడు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. గంటపాటు వారితో పోలీసులు మంతనాలు సాగించారు. బాధితుడిని వైద్యశాలకు పంపారు.

తనిఖీలలో బైక్‌ ఆపలేదనే కోపంతో నాగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్‌పై లాఠీ విసిరేసిన కానిస్టేబుల్‌ బాధితుడి తలకు గాయమై తీవ్ర రక్తస్రావం దాడికి నిరసనగా నాగిరెడ్డిపాలెం రహదారిపై బాధితుడి కుటుంబ సభ్యుల బైఠాయింపు

మాజీ సర్పంచ్‌పై కానిస్టేబుల్‌ దాడి 1
1/1

మాజీ సర్పంచ్‌పై కానిస్టేబుల్‌ దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement