భార్యను హత్యచేసిన వ్యక్తికి జీవిత ఖైదు
బాపట్లటౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 48 మంది బాధితులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీకి విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ తుషార్ డూడీ, అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ వెంటనే సంబంధిత సీఐ, ఎస్ఐలతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఎస్పీ ముందు వాపోయిన బాధితులు
డబ్బులు అడిగితే దాడులు చేస్తున్నారు.
నిజాంపట్నం మీదుళ్ళపర్రలోని 20 ఎకరాల్లో రొయ్యల సాగు చేశాను. మా చెరువుల్లోని 4.5 టన్నుల రొయ్యలను నిజాంపట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారులు కన్నా రాజేష్, శేరు జగన్లకు విక్రయించాను. మొత్తం రూ.24 లక్షలు రావాల్సి ఉండగా రూ.13 లక్షలు ఇచ్చారు. మిగిలిన రూ.11 లక్షలు ఇవ్వలేదు. డబ్బులు అడిగితే నా భర్త ఇంట్లోలేని సమయంలో మద్యం తాగి వచ్చి ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయంపై నిజాంపట్టణం పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదు. వారి వలన మాకు ప్రాణహాని ఉంది.
– పీతా లావణ్య దంపతులు, నిజాంపట్నం
ధాన్యం తీసుకెళ్లి డబ్బులు ఇవ్వడం లేదు
నేను ఈ ఏడాది నా పొలంలోని ధాన్యాన్ని నరసాయపాలెం గ్రామానికి చెందిన అశోక్బాబుకు విక్రయించాను. ఒక్కో బస్తా రూ.1800 చొప్పున 127 బస్తాలు విక్రయించాను. నాకు మొత్తం రూ.2,28,600 రావాల్సి ఉండగా రూ.1,19,400 ఇచ్చారు. మిగిలిన రూ.1,09,200 ఇవ్వాలి ఉంది. ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
– నక్కల నారాయణ, కంకటపాలెం, బాపట్ల మండలం
ఆస్తి మొత్తం తీసుకున్నారు
నాకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. వీరిలో పెద్ద కుమారుడు చనిపోయారు. నా చిన్నకుమారుడు సయ్యద్ మోహిద్దీన్, కొడలు నజీమూన్లు మా ఆస్తి మొత్తం తీసుకొని నన్ను, నా భర్తను చంపాలని చూస్తున్నారు. భయంతో నా భర్త ఏడాదిన్నర కిందట ఎటో వెళ్లిపోయారు. అసలు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ లేదు. నేను ప్రాణభయంతో వేటపాలెంలోని నా కుమార్తె వద్దకు తలదాచుకుంటున్నా. నా కొడుకు, కోడలు చెరనుంచి నన్ను కాపాడండి
– సయ్యద్ కరీమూన్, బొప్పుడి, చిలకలూరిపేట మండలం
కన్న కొడుకే చంపాలని చూస్తున్నాడు
కన్న కొడుకే చంపాలని చూస్తున్నాడు
కన్న కొడుకే చంపాలని చూస్తున్నాడు