ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్సార్‌... | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్సార్‌...

Sep 2 2026 3:04 AM | Updated on Sep 2 2026 3:04 AM

ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్సార్‌... ఆయన రైతుల పక్షపాతి వెలిగల్లు వైఎస్‌ఆర్‌ పుణ్యమే

పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడి ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలచిపోయారు. ఉచిత వైద్యం అంటేనే వైఎస్సార్‌ గుర్తుకు వస్తారు. – కాలనీ చిన్న, పీలేరు.

జలయజ్ఞం పథకం తీసుకొచ్చిన వైఎస్సార్‌ రైతుల పక్షపాతిగా నిలిచారు. రైతుల సమస్యలు తెలుసుకున్న వైఎస్సార్‌ సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పంటలు సస్యశ్యామలం చేయాలను ఉద్దేశంతో జలయజ్ఞం తెచ్చారు. మన పాంతానికి సాగునీరు ఇవ్వాలని హంద్రీనీవా ప్రాజెక్టు తీసుకొచ్చారు.

– సి.కె. యర్రమరెడ్డి, కేవీపల్లె.

గాలివీడు మండల పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే. రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తోంది. అంతేకాకుండా ప్రాజెక్టు పరిధిలో ఎంతోమంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తోంది. కుడి, ఎడమ కాలువల కింద రైతాంగం పంటల సాగు చేసి జీవిస్తున్నారు. మహనీయుడైన వైఎస్సార్‌ కలకాలం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.

– వెంకటయ్య, గాలివీడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement