3 రోజులు నియోజకవర్గంలో పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటించింది.
పర్యటన షెడ్యూల్..
మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడుతారు.
ఆ తర్వాత పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి వేల్పులలోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్తారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. గురువారం ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు పయనమవుతారు.


