సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. వైఎస్ జగన్ రాకతో భారీ సంఖ్యలో స్థానికులు అక్కడికి వచ్చారు.
కాగా, సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.




