
సాక్షి, తాడేపల్లి : రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు.
మంగళవారం (మే 20)న జరగనున్న ఈ సమావేశంలో రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లు పాల్గొననున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు సహా అనేక అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.