సాక్షి, అమరావతి: శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని పేర్కొన్నారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలని వైఎస్ జగన్ అభిలషించారు.


