సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి. ఒంటిమిట్ట, భద్రాది ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నవమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.


