Visakhapatnam: మద్యం మత్తులో యువతి హల్‌చల్‌.. బీర్‌బాటిల్‌తో దాడి.. ఏఎస్సైకి తీవ్రగాయాలు

Young lady Attack on Police at Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి హల్‌చల్‌ చేసింది. విశాఖ బీచ్‌ రోడ్డులో బీరు తాగుతూ యువతి న్యూసెన్స్‌ చేసింది. దీనిని ప్రశ్నించిన ఏఎస్‌ఐ సత్యనారాయణపై మద్యం బాటిల్‌తో దాడికి యత్నించింది. అది గురితప్పి పక్కనే ఉన్న గోవింద్‌ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది.

అనంతరం ఏఎస్సైని కాలితో తన్ని, దాడికి పాల్పడుతూ తీవ్రంగా గాయపరిచింది. పోలీసులు అయితే మీరేం చేస్తారంటూ అసభ్యపదజాలంతో యువతి రెచ్చిపోయింది. నా బాయ్‌ ఫ్రెండ్‌కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానంటూ బెదిరింపులకు దిగింది. రేపటి నుంచి పోలీసులెవరూ రోడ్డుమీద తిరగకుండా చేస్తానని మద్యం​ మత్తులో హెచ్చరించింది. ఘటన జరిగిన సమయంలో యువతి ఫుల్‌గా మద్యం సేవించినట్లు గుర్తించారు. గాయపడిన గోవింద్‌ అనే యువకుడు యువతిపై త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

చదవండి: (భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్‌.. చివరకు..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top