ఏపీ విద్యార్థికి రెండో ర్యాంకు | Vizianagaram Student Got All India 2nd Rank In NDA 2020 Entrance | Sakshi
Sakshi News home page

ఏపీ విద్యార్థికి రెండో ర్యాంకు

Sep 16 2020 8:03 AM | Updated on Sep 16 2020 8:49 AM

Vizianagaram Student Got All India 2nd Rank In NDA 2020 Entrance - Sakshi

విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన బడే మెహర్‌ సాత్విక్‌ నాయుడు జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్‌ సాధించాడు.

విజయనగరం అర్బన్‌: ప్రతిష్టాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన బడే మెహర్‌ సాత్విక్‌ నాయుడు జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్‌ సాధించాడు. బాడంగి మండలం రామచంద్రపురంకు చెందిన సాత్విక్‌ జిల్లాలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో చదువుతున్నాడు. సాత్విక్‌ గతంలోనూ 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో జాతీయ స్థాయి మొదటి ర్యాంక్‌ సాధించాడు. సాత్విక్‌ తల్లిదండ్రులు లక్ష్మి, సుగుణాకరనాయుడు, తాత సంజీవనాయుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఈ సందర్భంగా సాత్విక్‌ మాట్లాడుతూ నావికాదళంలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసి దేశానికి సేవలందించాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. 
(చదవండి: హాల్‌ టిక్కెట్లను వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement