
సాక్షి, విజయవాడ: జైలులో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి జైలు సిబ్బంది తీసుకొచ్చారు. గుండె సంబంధిత టెస్టులతో పాటు, బ్లడ్ టెస్ట్లను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేశారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా జైలుకు తరలించారు.
