తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు | Sakshi
Sakshi News home page

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు : నేడు ఏడవ రోజు

Published Fri, Dec 29 2023 9:19 AM

Vaikunta Dwara Darshan At Tirumala Temple - Sakshi

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో 7 రోజుగా కొనసాగనుంది. నిన్న వైకుంఠ ద్వార దర్శనంలో 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు.18,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.55 కోట్లు ఆదాయం వచ్చింది. ఆరు రోజుల్లో 3,95,983 మంది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆరు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 25.82 కోట్లు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1 వరకు పది రోజులపాటు కొనసాగనున్నాయి.

Advertisement
Advertisement