వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ.. స్పందించిన కేంద్రం | Union Health Ministry Responds To MP Gurumurthy Letter | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ.. స్పందించిన కేంద్రం

May 11 2025 7:13 AM | Updated on May 11 2025 7:57 AM

Union Health Ministry Responds To MP Gurumurthy Letter

తిరుపతి: తిరుపతిలో సీజీహెచ్‌ఎస్‌ (సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీం) వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తి­రుపతి ఎంపీ డా­క్ట­ర్‌ మద్దిల గురు­మూర్తి తెలిపా­రు. దీనికి సంబంధించి ఏప్రిల్‌ 4న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేంద్రం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసిందని ఎంపీ తెలిపారు.

కేవలం విజయవాడ, నెల్లూరు, విశాఖ, గుంటూరుకు మాత్రమే పరిమితమైన ఈ వెల్‌నెస్‌ సెంటర్‌ తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడం ద్వారా 15 వేల మంది కేంద్ర ప్రభు­త్వ సంస్థాగత ఉద్యోగులు, వారి కుటుంబ స­భ్యులు, పదవీ విరమణ పొందిన వారికి సరైన వైద్యం, రిఫరల్‌ సౌకర్యాలు అందుతాయన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement